హైదరాబాద్:రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది కనుక 2020-21 యాసంగి సీజన్కు సంబంధించి తెలంగా ణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్సీఐ తీసుకుంటుంది.మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వాలని అలాగే ఉప్పుడు బియ్యా న్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్ రైస్కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశమని పైగా ఇది రైస్ మిల్లర్ లకు సంబంధించిన వ్యవహారమని ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖలో స్ప ష్టంగా పేర్కొన్నారు.కానీ సెప్టెంబరు 26న ఢిల్లీ టూర్ వెళ్లిన సీఎం కేసీఆర్ గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని.దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయి ల్డ్ రైస్ ఉత్పత్తి అయ్యాయని ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్ రైస్ తీసుకోవాలని,రానున్న రోజుల్లో ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి పాత కోటా కు (24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ను అదనంగా ఎఫ్సీఐకి సరఫరా చేస్తామని స్పష్టంగా ఒప్పందం చేసుకుని కేంద్ర ప్రభుత్వ విధానాల కు అనుగుణంగా ఎఫ్సీఐకి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తామని ఇక మీదట ఎఫ్సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని హామీ ఇచ్చారు.కేంద్రం కూడా ఈసారికి తప్ప మరోసారి ఒక్క కూడా గిం జ బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కరాఖండిగా చెప్పి ఈ మేరకు లేఖాస్త్రాలన్నీ సెప్టెంబరు నెలాఖరుతోనే పూర్తి చేసింది.అయితే కేంద్రం వద్ద ఒప్పుకుని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన అం శాన్ని సీఎం కేసీ ఆర్ ఇంతకాలం అధికారికంగా వెల్లడించకుండా కేంద్రం అసలు బాయిల్డ్ రైస్ కొనబోమని అంటోందని వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్ర చారాన్ని మొదలుపెట్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో మతి భ్రమించి మిల్లర్లతో కుమ్మకై ధర్నా పేరుతో రాద్ధాంతాన్ని సృష్టిస్తూ రైతులను ఆందోళనలో పడే స్తూ కేం ద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర సర్కార్ కపటనాటకాలను గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్ను గద్దె దించాలని ఆమె వెల్లడించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...