హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం పండడంతో కటకటాల ఊచలు లెక్కిస్తున్నాడు.కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్కు చెందిన నిందితుడు నెల్లూరు స్వామి డీఎస్పీ డ్రెస్లో వాహనాన్ని పెట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం,సెటిల్మెంట్ చేయడంపై ఆరోపణలు ఉన్నాయి.ఇం టర్మీడియెట్ పాస్ కాని వ్యక్తి డీఎస్పీ కావడమేంటని బాధితులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆశ్రయించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నెల్లూరు స్వామిని అదుపులోకి తీసుకున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...