హైదరాబాద్:నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్ పూర్తయింది.టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు చేస్తున్నారు.నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలయ్యాయి.ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి.పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు,ప్రొఫెసర్ కోదండరామ్కు 70,072,బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,107ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్కు 27,588 ఓట్లు వచ్చాయి.టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కీలకంగా మారాయి.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...