హైదరాబాద్:నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్ల కౌంటింగ్ పూర్తయింది.టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 1,10,840 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు చేస్తున్నారు.నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలయ్యాయి.ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి.పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు,ప్రొఫెసర్ కోదండరామ్కు 70,072,బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,107ఓట్లు,కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్కు 27,588 ఓట్లు వచ్చాయి.టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం సెకండ్ ప్రయారిటీ ఓట్లు కీలకంగా మారాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...