నల్గొండ:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.నల్గొండ స్థానంలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్ అయ్యారు.ఇక టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా 25 వేల 530 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో మల్లన్న,మూడో స్థానంలో ప్రొ.కోదండరామ్ ఉన్నారు.పల్లా రాజేశ్వర్రెడ్డికి మొత్తం లక్షా 17 వేల 386 ఓట్లు రాగా మల్లన్నకు 91,858 ఓట్లు,ప్రొ.కోదండరామ్కు 79,110 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజా రిటీ తగ్గింది.పోటాపోటీగా దూసుకుపోతున్నారు మల్లన్న,కోదండరాం.రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 6586 ఓట్లు రాగా మల్లన్నకు 8563 ఓట్లు,కోదండంరాంకు 9038 వచ్చాయి.మల్లన్న కంటే 475 ఓట్లు ఎక్కువ సాధించారు కోదండరాం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...