నల్గొండ:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.నల్గొండ స్థానంలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్ అయ్యారు.ఇక టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా 25 వేల 530 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో మల్లన్న,మూడో స్థానంలో ప్రొ.కోదండరామ్ ఉన్నారు.పల్లా రాజేశ్వర్రెడ్డికి మొత్తం లక్షా 17 వేల 386 ఓట్లు రాగా మల్లన్నకు 91,858 ఓట్లు,ప్రొ.కోదండరామ్కు 79,110 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజా రిటీ తగ్గింది.పోటాపోటీగా దూసుకుపోతున్నారు మల్లన్న,కోదండరాం.రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 6586 ఓట్లు రాగా మల్లన్నకు 8563 ఓట్లు,కోదండంరాంకు 9038 వచ్చాయి.మల్లన్న కంటే 475 ఓట్లు ఎక్కువ సాధించారు కోదండరాం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...