జగిత్యాల:ఒక వైపు కరోనా మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు.దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుం ది.ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం పై దృష్టి పెట్టడం పనిలో నిమ్మగ్నమవ్వడం చేస్తుంటారు.అయినా కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా ముఖ్యమే.నియంత్రణ లేని ఆలోచనలను అధిగ మించేందుకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి.డిప్రెషన్ను అధిగమించేందుకు ఉరుకుల పరుగుల ప్రయాణాలకు దూరంగా చుట్టు పచ్చని చెట్లు పక్షుల శబ్ధాలు విన బడే ప్రదేశాలకు వెళ్లిపోవాలనుకుంటారు.అయితే అలా వెళ్లడం చాలా మందికి కుదరకపోవచ్చు.మీ ఇంటినే పచ్చని చెట్లతో అందంగా ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసుకోవచ్చు.అలాగే కొన్ని రకాల మొక్కలు మీ ఇంట్లో ఉండడం వలన ఒత్తిడిని తగ్గిస్తాయి. *తులసి:తులసి చెట్టుకు మన భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది.తులసి దేవతగా భావించి పూజిస్తుంటారు.అలాగే తులసి వలన ఎన్నో ఆరోగ్య ప్రయో జనాలున్నాయి.తులసి చెట్టును ఇంట్లో పెట్టడం వలన అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. *గులాబీలు:ఇంట్లో గులాబీ మొక్కను నాటడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.గులాబీలు శాంతి,ప్రేమ,సానుకూల వాతావరణానికి ప్రతికూలంగా నిలుస్తాయి.ఈ మొక్క ఒత్తిడిని తగ్గించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. *మనీ ప్లాంట్:ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క.బెడ్ రూమ్,బాల్కనీ,బాత్రూమ్,డ్రాయింగ్ రూమ్ లేదా గార్డెన్లో కూడా ఈ మొక్కను సులువుగా పెంచవచ్చు.కొంతమంది ఈ మొక్కలను వంటగదిలో పెంచుతుంటారు.దీని ద్వారా వంట గది ఎంతో అందంగా ఉంటుంది.ఈ మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.ఈ మొక్కలకు ఎక్కువ జాగ్రత్త అవసరం. *జాస్మిన్:మల్లె పూల సువాసన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.మల్లె మొక్కలను పవిత్రంగా భావిస్తారు.ప్రపంచంలోని అనేక దేశాలలో పూజిస్తారు.జాస్మిన్ పువ్వు విశ్వాసం,ప్రేమ,సంబంధాన్ని బలోపేతం చేసే చిహ్నంగా భావిస్తారు.ధూపం,మల్లె పువ్వులు కొవ్వొత్తులకు సువాసనను జోడించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్కలను నాటడం వల్ల రాత్రికి మంచి కలలు వస్తాయని అంటారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...