ఇక తెలంగాణలో..ఆయుష్మాన్‌ భారత్‌ పథకం

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారుచేసింది.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆరోగ్య యోజన-ఆ యుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు.అందుకు అనుగుణంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కు దుర్చుకుంది.ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు.ఆయుష్మాన్‌ భారత్‌ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరో గ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు.ఆయుష్మాన్‌ భారత్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.ఈ ప థకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు.అయితే అంతకు ముందు ఆగస్టులోనే హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలిక నుఈ పథకం మొదటి లబ్ధిదారుగా చెబుతారు.ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు.ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పు డు రూ.5లక్షల వరకు చికిత్స ఉచితం.దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here