హైదరాబాద్:తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది.అలాగే నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనుంది.ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 31న నామినేషన్లను పరిశీలించనుంది.ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినే షన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు.నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో సాగర్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు.కరోనా కారణంగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు ఒక్కరినే అనుమతి ఇస్తారు.నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా ఇంకా అధికార టీఆర్ఎస్,బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.ఒక్క కాం గ్రెస్ మాత్రమే జానారెడ్డి పేరును ఖరారు చేసింది.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో 1,08,907 మంది పు రుషులు ఉండగా 1,10,838 మంది మహిళలు ఉన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...