హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో భరించలేని నొప్పి రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.ఈ క్రమంలో టెస్టులు చేసి లెఫ్ట్ కిడ్నీలో రాళ్లున్నట్టుగా గుర్తించారు.అయితే వీటిని గంటపాటు కీహో ల్ సర్జరీ చేసి వీటిని తొలిగించారు.రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు.రామలక్ష్మయ్య గతంలో కూడా పలుమార్లు ఈ నొప్పి వచ్చేది.స్థానిక హెల్త్ ప్రాక్టిషనర్ దగ్గర చికిత్సతో తాతాల్కిక ఉపశమనం పొందేవాడు.కానీ ఈ సమస్య ఎక్కువ కావడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరాడు.వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నా యని,దీని ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు.వేసవికాలంలో ఎక్కువ నీరు,కొబ్బరి నీరు (వీలైతే) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...