శ్రీశ్రీ ఆలోచనలను యువత అర్థం చేసుకోవాలి:వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ:మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)జయంతి సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు.తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొ క్కించడమే కాకుండా,తెలుగు కవితను సామాన్యులకు చేరువ చేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని పే ర్కొన్నారు.1000కి పైగా సినీ గీతాలు రచించి,తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన ఆయన కవిత్వం ఆలోచనాత్మకం అని వివరించారు.సంప్రదాయ క వితా విధానాన్ని తోసిరాజని శ్రీశ్రీ కార్మిక,కర్షక,తాడిత,పీడిత,బడుగు,బలహీన వర్గాల బతుకులనే కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజంలో ఆలోచన రేకెత్తించార ని వెంకయ్య వెల్లడించారు.శ్రీశ్రీ ఆలోచనల్లోని అంతరార్ధాన్ని గ్రహించి నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నానని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here