నల్గొండ:కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కార్యాకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్ర మే వెసులుబాటు ఉంది.ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు.శనివారం నల్గొండలో పోలీసులు ఇంకాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు.రోడ్లపైకి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు.రోడ్డుపై కనపడిన వారిని కనపడినట్లు లాఠీలతో కొట్టారు.ఈ నేపథ్యంలో ఓ విద్యుత్ ఉద్యో గిపై దాడి చేయటంతో ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.పట్టణంలో సరఫరా అవుతున్న విద్యుత్ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు.సమాచారం తెలుసు కున్న జిల్లా ఎస్పీ కేవీ రంగనాథ్ విద్యుత్ ఎస్సీ కృష్ణయ్యతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం సుమారు 2గంటలకు విద్యుత్ పునరుద్ధరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి వెళ్లడంతో విద్యుత్ ఉద్యోగులకు పాస్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.మూడున్నర గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులు ఇబ్బంది పడ్డారు.దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సమాధానమిచ్చారు.అయితే తాము పోలీస్ ఠాణాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయలేదని బ్రేక్ డౌన్ అయినందునే ఇబ్బంది తలెత్తిందని ట్రాన్స్ కో డీఈ తెలి యజేశారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...