హైదరాబాద్:ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా ఈటెల రాజేందర్ వ్యవహారమే హాట్ టాపిక్గా మారుతోంది.తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి కెసిఆర్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు ఈటెల రాజేందర్.అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రినే చేశారు కేసిఆర్.సరిగ్గా నిన్నటి వరకు ఈటెల రా జేందర్ వైద్య,ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్నారు.కరోనా కేసులను కట్టడి చేయడంతో ఆయన బాగా పనిచేశారంటూ ప్రజల నుంచి ప్రసంశలు వచ్చాయి.ఇది బాగానే ఉ న్నా అసలు విషయం అంతకుముందు ప్రభుత్వంపైనే విమర్సలు చేస్తూ పలు సభల్లో ఈటెల రాజేందర్ మాట్లాడటమే కెసిఆర్ కుటుంబానికి కోపం తెప్పించిందట.ము ఖ్యంగా కేసిఆర్కు కాదు ఆయన కుమారుడు కెటిఆర్కు బాగా కోపమొచ్చిందట ఒక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తమ ప్రభుత్వంపైనే విమర్సలు చేయడాన్ని కే టిఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోయారట.అయితే దానికి సమయం కోసం వేచి చూస్తూ వచ్చారట అంతేకాదు కెసిఆర్తో స్వయంగా మాట్లాడి ఈటెలను పూర్తిగా పక్క కు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారట.కానీ ఇంతలో తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో పాటు ఈటెల రాజేందర్ ప్రజలకు దగ్గరవ్వడం ఎప్పటికప్పుడు కరోనాపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించడం లాంటివి చేస్తూ తన పనిని తాను సమర్థవంతంగా చేస్తున్నారట దీంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారనే టాక్ వస్తోంది.ఈ నేపధ్యంలో ఈటెల రాజేందర్ భూ వ్యవహారంలో ఇరుక్కున్నారు.అందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి కేటిఆరేనట.2016 సంవత్సరంలో మాసాయి పేటలో అచ్చంపేట గ్రామంలో భూకొనుగోలు వ్యవహారం ఇప్పుడు ఈటెల వ్యవహారంలో పెద్ద తలనొప్పిగా మారింది.హేచరీస్ కోసం అప్పట్లో 100 కోట్లు అప్పులు తీసు కోవడమే కాదు స్థలాన్ని కబ్జా కూడా చేశాడని ఆరోపణలున్నాయి.ఈ కేసును మళ్ళీ తిరగదోడటమే కాకుండా వెంటనే కెసిఆర్ విచారణకు ఆదేశించారు.అంతటితో ఆగ లేదు వైద్య ఆరోగ్య శాఖ పదవిని ఈటెల నుంచి తీసేసుకున్నారు.సీఎం కేసీఆర్ స్వయంగా ఇప్పుడు ఆ పదవిని చూడబోతున్నారు.కేసిఆర్ అనారోగ్యంతో ఉండడంతో పాటు కెటిఆర్ కూడా ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్తో ఉన్నారు.కానీ ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకూడదని ఇప్పుడే ఈటెలకు స్కెచ్ వేశా రన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.కేటిఆర్ దర్సకత్వంలోనే ఈటెల రాజేందర్ కథ మొత్తం సాగుతుందన్నది విశ్లేషకుల భావన. మరి చూడాలి కేటిఆర్ ఆటలో ఈటెల పరిస్థితి ఏంటన్నది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...