హైదరాబాద్:ఎవర్ని అంటున్నారో నేరుగా చెప్పకపోయినా సీఎం కేసీఆర్ కు సూటిగా తగిలేలా మంత్రి ఈటెల చేస్తున్న వ్యాఖ్యల జోరు మరింత పెంచారు.పాలనకు మెరిట్ కావాలని,మేము గులాబీ పార్టీ ఓనర్లమని,కొట్లాడేతత్వం కోల్పోలేదంటూ హాట్ కామెంట్స్ చేసిన ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ మట్టికే పోరాడే తత్వం ఉందని.చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందన్న విషయాన్ని పాలకులు మర్చిపోరాదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు.ఉద్యమాన్ని ఆపే శక్తి జేజేమ్మకు కూడా లేదని సమైక్య పాలకులకు చెప్పామన్నారు.కులాలను బట్టి గౌరవించే పరిస్థితులు ఒక్క మనదేశంలోనే చూస్తున్నామన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని,కేవలం ఓట్ల కోసం మాత్రమే పనులు చేయవద్దంటూ ఈటెల కామెంట్ చేయటం విశేషం.ఇటీవల షాదీముబారక్, కళ్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలతో పేదరికం పోదని ప్రజల జీవన పరిస్థితులు మెరగయ్యే చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...