కరీంనగర్:కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది.గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ప్రధానపార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారానికి పోటీ పడి గ్రామాల నుంచి మహిళా కూలీలను తీసుకెళ్తున్నారు.దీంతో ఇప్పుడు హుజూరాబాద్ లో వ్యవసాయ పనులకు కొరత నెలకొంది.ఈ క్రమంలోనే ఓ గ్రామానికి చెందిన మహిళలు ఇప్పుడు పార్టీల వెంట పడుతున్నారు.ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కొందరికీ లాభంగా మారింది.కూలీ పనికి వెళ్లే వాళ్లు ఇప్పుడు పార్టీల తరుఫున ప్రచారానికి వెళుతున్నారు.పొద్దున్నుంచి సాయం త్రం వరకు ఎండలో కూలీ చేస్తే రూ.300 ఇస్తున్నారని ప్రచారానికి వెళ్తే అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు.పొద్దున ఓ పార్టీకి సాయంత్రం మరో పార్టీకి ఓట్లు అ డుగుతున్నామని అంటున్నారు.ఇప్పుడు కూలీలకు ఇది గిట్టుబాటు అయ్యేలా కనిపిస్తోంది.ఇప్పుడు ప్రచారానికి రూ.1000 వరకూ ఒక్కొక్కరికి ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.ఎన్నిక ల వల్ల కూలీలు పండుగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...