హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి మూడు ఏళ్ల తరువాత ప్లీనరి నిర్వహించడానికి సిద్ధమయింది.భాగ్యనగరంలోని హెచ్ఐసీసీ లో రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది.2018 తరువాత జరుగుతున్న ఈ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్.పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేలా ఈ ప్లీనరి జరగనుంది.ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల సభ్యులను ఆహ్వానించింది.పార్టీని పటిష్టం చేసేందుకు కార్యచరణ ప్రణాళికను కేసీఆర్ ఈ వేదికపై ప్రవేశపెట్టనున్నాడు.ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది.మొదటగా అమరవీరులకు నివాళులర్పించి,తరువాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు కేసీఆర్.అలాగే పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన తరువాత కేసీఆర్ ప్రసంగిస్తారు.అనంతరం పార్టీ రాజకీయ,జాతీయ,ప్రాంతీయ స్థాయి అంశాలపై ఏడు తీర్మాణాలను ప్రవేశపెట్టనున్నారు.ఈ అంశాలను ఏడుగురు నేతలు ప్రతిపాదిస్తారు.అనంతరం వాటిపై చర్చించి ఆమోదిస్తారు.మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు సహా దాదాపు 7000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.పురుషు లు,మహిళలు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని పార్టీ అధిష్టానం నిర్దేశించింది.ఇక ఈ గులాబీ పండుగకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...