హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి మూడు ఏళ్ల తరువాత ప్లీనరి నిర్వహించడానికి సిద్ధమయింది.భాగ్యనగరంలోని హెచ్ఐసీసీ లో రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది.2018 తరువాత జరుగుతున్న ఈ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్.పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేలా ఈ ప్లీనరి జరగనుంది.ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల సభ్యులను ఆహ్వానించింది.పార్టీని పటిష్టం చేసేందుకు కార్యచరణ ప్రణాళికను కేసీఆర్ ఈ వేదికపై ప్రవేశపెట్టనున్నాడు.ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది.మొదటగా అమరవీరులకు నివాళులర్పించి,తరువాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు కేసీఆర్.అలాగే పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన తరువాత కేసీఆర్ ప్రసంగిస్తారు.అనంతరం పార్టీ రాజకీయ,జాతీయ,ప్రాంతీయ స్థాయి అంశాలపై ఏడు తీర్మాణాలను ప్రవేశపెట్టనున్నారు.ఈ అంశాలను ఏడుగురు నేతలు ప్రతిపాదిస్తారు.అనంతరం వాటిపై చర్చించి ఆమోదిస్తారు.మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు సహా దాదాపు 7000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.పురుషు లు,మహిళలు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని పార్టీ అధిష్టానం నిర్దేశించింది.ఇక ఈ గులాబీ పండుగకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...