హైదరాబాద్:తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి ఓ కంట్రీ మేడ్ పిస్టల్,తపంచా,రెండు మేగజిన్లు,మూడు బుల్లెట్లు,ఆరు మొబైల్ ఫోన్లు,ఓ ద్విచక్ర వాహనం,కారు స్వాధీనం చేసుకున్నారు.వారిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన లియోనాడ్ స్వామి (34) ఉ ప్పల్లో ఉంటున్నాడు.గచ్చిబౌలి,మియాపూర్,కూకట్పల్లి పోలీ్సస్టేషన్ల పరిధిలో పలువురిని బెదిరించిన కేసుల్లో నిందితుడు.యాదగిరిగుట్టలో ఉంటున్న సాయి కృష్ణ (26)కు పిస్టల్ విక్రయించ డానికి స్నేహితుడు చింతకింది సాయిరాం (26)తో కలిసి లియోనాడ్ బేరం కుదుర్చుకున్నాడు.సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల దాడులు నిర్వహించి ముగ్గురినీ అదుపులో కి తీసుకున్నారు.తదుపరి విచారణ నిమిత్తం వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...