తెలంగాణలో వీటికి మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు

హైదరాబాద్:ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి,లాక్ డౌన్విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది.మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యా బినెట్ నిర్ణయించింది.ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది.కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి.మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు,అను బంధ రంగాలు,వ్యవసాయ యంత్రాల పనులు,రైస్ మిల్లుల నిర్వహణ,సంబంధిత రవాణా,ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం,ఫెర్టిలైజర్,సీడ్ షాపులు,విత్తన తయారీ కర్మా గారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధి గా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు,వైద్య పరికరాల తయారీ కంపెనీలు,మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు,మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు,ప్రభుత్వ,ప్రైవేటు దవాఖానాలు,వారి వారి ఉద్యోగులు,సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి,వాహనాలకు అనుమతిస్తారు.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా,పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.విద్యుత్ ఉత్పత్తి,పంపిణీ వ్యవస్థలు,వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.జా తీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.జాతీయ రహదారులపై పెట్రోల్,డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.కోల్డ్ స్టోరేజీ,వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు,ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు,ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి,అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి,తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం,ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో,ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.ఉదయం 6 గంట ల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here