ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్..టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్..దుబాయ్:దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.173 పరు గుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది.ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్,ఓపెనర్ డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్ బౌలింగ్ను ఊచకోత కోశారు.మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు.వార్నర్ 38 బం తుల్లో 4 ఫోర్లు,3 సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు.చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్;4 ఫోర్లు,1 సిక్సర్) సైతం దూకుడుగా ఆడడంతో న్యూజిలాండ్ జట్టు టైటిల్ పై ఆశలు వదులుకుంది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు రెండు వికెట్లు దక్కాయి.ఇప్పటివరకు టెస్టుల్లో అగ్ర పీఠం,వన్డేల్లో వరల్డ్ కప్ లు అందుకున్న ఆస్ట్రేలియాకు ఇప్పటివరకు అందని ద్రాక్షలా ఊరించిన టీ 20 వరల్డ్ కప్ ఇన్నాళ్లకు దక్కింది.ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది.ఆస్ట్రేలియా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఐదు పర్యాయాలు వరల్డ్ కప్ గెలిచింది.తాజాగా టీ20 ఫార్మాట్లో తొలిసారిగా విజేతగా నిలిచింది.ఇక,2019లో వన్డే వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మెట్టుపై నిరాశ పర్చింది.ఈ మెగా టోర్నీ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.రన్నరప్ గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.5.9 కోట్లు దక్కాయి. మిచెల్ మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’,డేవిడ్ వార్నర్ కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...