అహ్మదాబాద్:ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది.సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో ఆల్రౌండ్షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ సిరీస్ను ఘన విజయంతో ముగించింది.టాస్ ఓడి మొ దట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(64:34 బంతుల్లో 4ఫోర్లు,5సిక్సర్లు)విరాట్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు)అద్భుత అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్ యాదవ్(32:17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు)హార్దిక్ పాండ్య(39 నాటౌట్: 17 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు)ధనాధన్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు.ఇంగ్లాండ్ బౌలర్లు ఆతిథ్య బ్యాట్స్మెన్ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది.ఆ జట్టులో డేవిడ్ మలన్(68:46 బంతుల్లో 98ఫోర్లు,2సిక్సర్లు) జోస్ బట్లర్(52:34 బంతు ల్లో 2ఫోర్లు,4సిక్సర్లు)మాత్రమే అర్ధశతకాలతో రాణించారు.ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది.కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యా ట్స్మెన్ను టీమ్ఇండియా బౌలర్లు ఔట్ చేసి మ్యాచ్పై పట్టుసాధించారు.ఆఖర్లో సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటం వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుం ది.బెన్స్టోక్స్(14) చెలరేగా ప్రయత్నం చేసినా నటరాజన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.జేసన్ రాయ్(0),జానీ బెయిర్స్టో(7) ఇయాన్ మోర్గాన్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/15) శార్దుల్ ఠాకూర్(3/45) గొప్పగా బౌలింగ్ చేశారు.’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్,కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...