సివిల్స్ లో మెరిసిన శరత్ నాయక్..

జగిత్యాల:సివిల్ ఫలితాల్లో 370 ర్యాంకు సాధించిన జగిత్యాల నియోజక వర్గంలోని బీర్ పూర్ మండల చర్ల పల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 370 వ ర్యాంక్ సాధించారు.ఈ మేరకు జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శరత్ నాయక్ ను ఫోన్ లో అభినందించారు.శరత్ తండ్రి వ్యవసాయం చేస్తూ ఉండగా,తల్లి గ్రామంలో అంగన్ వాడి లో పనిచేస్తూ ఉండగా శరత్ కష్టపడి చదివి సివిల్స్ లో ర్యాంక్ సాధించడం పట్ల ఎమ్మేల్యే అభినందించారు.సివిల్స్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి దేశంలోనే జగిత్యాల పేరును నిలవడం పట్ల ఎమ్మెల్యే ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here