తెలంగాణ రాజకీయాల్ని మార్చనున్న సాగర్ ఫలితం..!

హైదరాబాద్:నాగార్జున సాగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మారబోతోంది.కాంగ్రెస్,టీఆర్ఎస్,బీజేపీలకు ఈ ఎన్నిక లిట్మస్ టెస్ట్‌గా మారింది.గె లుపు అవకాశాలు ఉన్నాయని ఓ వైపు గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తేనే మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పోటీ పడగలిగే స్థితిలో ఉంటుందనేది అందరూ అంగీ కరించే నిజం.అందుకే మిగతా పార్టీల కన్నా నాగార్జున సాగర్ ఇప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం.కానీ వడ్డించిన విస్తరిని ముందు పెట్టినా చిందరవందర చేసుకునే మనస్థత్వం కాంగ్రెస్ నేతలది.ఇప్పుడు సాగర్ విషయంలో ఏం చేస్తారోనన్నది ఆసక్తికరం.నాగార్జున సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కూడా కీలకమే.ప్రభుత్వ వ్యతిరేక త ఎక్కువ ఉందన్న ప్రచారం పూర్తిగా తగ్గాలంటే సాగర్‌లో గెలవాలి.అందుకే ఆరు నూరైనా సాగర్ టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సిందేనని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దే శం చేసి పంపించారు.సిట్టింగ్ సీటు అయినా గెలిస్తే టీఆర్ఎస్‌కు వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది.కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న అధికార వ్యతిరేకత అనేది మటు మాయం అవుతుంది.మళ్లీ టీఆర్ఎస్‌కు గత వైభవం వస్తుంది.దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రభావం పూర్తిగా కనుమరుగు అవుతుంది.అందుకే నాగార్డున సాగర్ ను టీఆర్ఎస్ ఎప్పుడూ లేనంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.బీజేపీకి కూడా సాగర్ ఉపఎన్నిక చావో రేవో అన్నట్లుగా మారింది.దుబ్బాక తర్వాత గ్రేటర్‌లో మంచి ఫలి తాలు సాధించి ఇక సీఎం సీటే మిగిలిందన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.దానికి తగ్గట్లుగా సాగర్‌లో ఇప్పుడు ప్రభావం చూపించాల్సి ఉంది.తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటి వరకూ ఎలుగెత్తి చాటుతున్న భారతీయ జనతా పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి.దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో వచ్చిన హైప్ అంతా ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోవడం నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడో నాలుగో స్థానంలో ఉండిపోవడంతో చల్లబడిపోయి నట్లయింది.ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక ద్వారా మళ్లీ బీజేపీ తనను తాను మరోసారి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంది.అక్కడ ప్రభావం చూపిస్తే పెద్ద ఎత్తున మళ్లీ ప్రత్యా మ్నాయం అనే ప్రచారం లభిస్తుంది.లేకపోతే ఏమీ ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here