దిస్పూర్:అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి.అసలు ఓటర్లకు పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు.మరో వైపు విచ్చలవిడిగా డ బ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా హసావో జిల్లాలోని హాఫ్లాంగ్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్ల కంటే ఎక్కు వ ఓట్లు పోలవడంతో రచ్చ రచ్చగా మారింది.దీనికి బాధ్యలైన ముగ్గురు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా హాప్లాంగ్లో ఏప్రిల్ 1న పోలింగ్ జరిగింది.స్థానిక ఖోట్లిర్ ఎల్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా ఈవీఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి.దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.సస్పెన్షన్ ఉత్తర్వులు ఏప్రిల్ 2వ తేదీనే జారీ అయిన్పటికీ ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.ఘటన నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.అయితే సస్పెండ్ అధికారులు చెబుతున్న విషయాలు విస్తు గొలుపుతున్నాయి.ఈసీ ఓటర్ల జాబితాను అంగీక రించని స్థానిక గ్రామపెద్ద తమ సొంత జాబితాను తీసుకొచ్చారని,దాని ప్రకారమే అక్కడ ఓటింగ్ జరిగిందని అధికారులు చెబుతున్నారు.అందువల్లే జాబితా కంటే ఎ క్కువ ఓట్లు పోలైనట్లు తెలిపారు.ఇదిలా ఉంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వచ్చిన ఓటరు జాబితా లెక్కలతో పోలింగ్ జరపాల్సింది పోయి అతనెవరో తెచ్చిన వాటి లెక్కప్రకారం పోలింగ్ జరపడమేంటని జనాలు ప్రశ్నిస్తున్నారు.దీంతో ఈ విషయం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది.ఇటీవల కరీమ్గంజ్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంను ప్రైవేటు వాహనంలో తరలిస్తుండటం,అది భాజపా అభ్యర్థికి చెందిన కారు కావడం తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే.ఎన్నికల సందర్భం గా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...