హైదరాబాద్:సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.తన రాజీనామాను సీఎం సోమేశ్ కుమార్ కు పంపించారు.వెనువెంటనే ఆయన రాజీనామా ను ప్రభుత్వం ఆమోదించడం జరిగింది.ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ,తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు.గత 26 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలలో పని చేశానని చెప్పారు.రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని వెంకట్రామిరెడ్డి కొనియాడారు.దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు.రానున్న వందేళ్లు తెలంగాణ గురించి చెప్పుకునేలా కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కితా బునిచ్చారు.ఈ అభివృద్ధి పయనంలో కేసీఆర్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తానని తెలిపారు.మరోవైపు వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ కు ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...