నాగార్జునసాగర్‌లో 17 నామినేషన్ల తిరస్కరణ

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థుల నామినేషన్లకు స్క్రూటినీ పూర్తి అయింది.17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్క రించారు.నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ,మరో 15 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యారు.మిగిలిన 60 మంది అభ్యర్థుల నామినే షన్లను అధికారులు ఆమోదించారు.నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్నీ ప్రక్రియ జరిగింది.ఏప్రిల్ 3 వరకు నామినేషన్స్ ఉపసంహరణకు గడు వు విధించారు.ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగనుండగా మే 2న కౌంటింగ్ జరుగనుంది.ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్,కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి,బీజేపీ నుంచి రవినాయక్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు.దీంతో ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశా రు.నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.పార్టీల అధ్యక్షులు,సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.విజ యంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here