న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.లక్షల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3.46,786కేసులు నమోద య్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కి చేరింది.ఇందులో 8,67,997 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 25,52,940 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2624 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు క రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,89,544కి చేరింది.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 2,19,838 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.