పెద్దపల్లి/మంథిని:పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకు ఉచ్చు బిగుస్తోంది.వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.ఈ కేసుకు సంబంధించి మే 17న ఛార్జిషీట్ వేయనున్నారు.అయితే ఈ కేసు విచారణలో కీలక నిజాలు బయటపడ్డాయి.వామన్ రావు దంపతుల హత్య సమయంలో బిట్టు శ్రీను వినియోగించిన కారును పుట్ట మధు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాదు వామన్ రావు దంపతుల హత్యకు ముందు పుట్ట మధు రూ.2 కోట్లు డ్రా చేసేనట్లు బ్యాంకుల నుంచి ఆధారాలు సేకరించారు.పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు.వామన్ రావు హత్య కేసులో బిట్టు ఏ4గా ఉన్నారు.ఇది లా ఉంటే పుట్ట మధు ఆదృశ్యంపై సస్పెన్స్ వీడింది.ఈ మిస్టరీలో కూడా పోలీసులు కీలక నిజాలు గుర్తించారు.పుట్ట మధు ఆయన సోదరుడితో కలిసి 5 రాష్ట్రాల్లో తి రిగారు.చివరకు ఏపీలోని భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు.ఇక వారం రోజులుగా ఆయన ఫోన్ సిగ్నల్ కూడా సరిగా చూపించలేదు.అత్యాధు నిక టెక్నాలజీని వినియోగించి పుట్ట మధును పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.అయితే పుట్ట మధుపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.పుట్ట మిస్సింగ్ పై పో లీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారించేందుకు పోలీసు లు సిద్ధమవుతున్నారు.వామన్ రావు దంపతుల హత్య వెనుక పుట్ట మధు భార్య హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Latest article
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...
దేశంలో కరోనా డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...