పెద్దపల్లి/మంథిని:పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకు ఉచ్చు బిగుస్తోంది.వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.ఈ కేసుకు సంబంధించి మే 17న ఛార్జిషీట్ వేయనున్నారు.అయితే ఈ కేసు విచారణలో కీలక నిజాలు బయటపడ్డాయి.వామన్ రావు దంపతుల హత్య సమయంలో బిట్టు శ్రీను వినియోగించిన కారును పుట్ట మధు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాదు వామన్ రావు దంపతుల హత్యకు ముందు పుట్ట మధు రూ.2 కోట్లు డ్రా చేసేనట్లు బ్యాంకుల నుంచి ఆధారాలు సేకరించారు.పుట్ట మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు.వామన్ రావు హత్య కేసులో బిట్టు ఏ4గా ఉన్నారు.ఇది లా ఉంటే పుట్ట మధు ఆదృశ్యంపై సస్పెన్స్ వీడింది.ఈ మిస్టరీలో కూడా పోలీసులు కీలక నిజాలు గుర్తించారు.పుట్ట మధు ఆయన సోదరుడితో కలిసి 5 రాష్ట్రాల్లో తి రిగారు.చివరకు ఏపీలోని భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారు.ఇక వారం రోజులుగా ఆయన ఫోన్ సిగ్నల్ కూడా సరిగా చూపించలేదు.అత్యాధు నిక టెక్నాలజీని వినియోగించి పుట్ట మధును పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.అయితే పుట్ట మధుపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.పుట్ట మిస్సింగ్ పై పో లీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారించేందుకు పోలీసు లు సిద్ధమవుతున్నారు.వామన్ రావు దంపతుల హత్య వెనుక పుట్ట మధు భార్య హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...