స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..

చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వీరిలో కేకేఎస్ రా మచంద్రన్,ఏ వేలు,ఆర్ గాంధీ,పీకే శేఖర్ బాబు,కేఎన్ నెహ్రూకు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.తెలుగువారందరికీ స్టాలిన్ కీలక శాఖలను అప్పగించారు.అరు ప్పుకొట్టై ఎమ్మెల్యేగా గెలిచిన కేకేఎస్ రామచంద్రన్ కు కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించగా తిరువణ్ణామలై ఎమ్మెల్యే ఏ వేలుకుడబ్ల్యూడీ శాఖ దక్కింది.రాణిపేట నుంచి విజయం సాధించిన ఆర్ గాంధీకి టెక్స్ టైల్ శాఖను కట్టబెట్టారు.చెన్నై దురైముగం నియోజకవర్గం ఎమ్మెల్యే పీకే శేఖర్ బాబుకి దేవాదాయశాఖ మంత్రిగా అవ కాశం లభించింది.తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూకు మున్సిపల్ శాఖ మంత్రి కేటాయించారు స్టాలిన్.గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత,పళనిస్వామి,పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు.స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు.తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు.అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి.గతంలో బాలకృష్ణారెడ్డి,క దంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here