న్యూఢీల్లి:భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను విడుదల చేసింది.ఈ సం దర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి.రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది.ఇక,ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు,ఎమ్మెల్యేలు ఉంటారు.నామినేటెడ్ సభ్యులు,ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు.కాగా,పార్లమెంట్ ప్రాంగణం,రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహ రించనున్నారు.ఇక,ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29.నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2.జూలై 18న పోలింగ్,జూలై 21వ తేదీన కౌంటింగ్ జరుగనుంది.బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు.ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి,ముస్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇక,అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్,రాజ్నాథ్ సింగ్ ఉన్నట్టు సమాచారం.మైనార్టీ కో టాలో గులామ్ నబీ ఆజాద్,నఖ్వీ,అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నారు.ఎంపీ ఓటు విలువ 700 ఉండగా అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది.ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10, 98,903 ఓట్లు ఉండగా బీజేపీకి 4,65,797,మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి.ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి.యూపీఏకు 24.02 శాతం,ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...