మమత గూటికీ 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌లో 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్లు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.కొందరు బీజేపీ నాయకులు తమతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిన మాజీ టీఎంసీ నాయకులు ఘర్ వాపసీ (సొంత ఇంటికి తిరిగి రావాలని) మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.దక్షిణ 24 పరగణాలలోని సత్గాచియాకు చెందిన నా లుగుసార్లు శాసనసభ్యుడైన గుహా మమతాబెనర్జీకి లేఖ రాశారు.చేపలు నీటి నుంచి బయటపడలేవు మీరు లేకుండా నేను జీవించలేను అని దీదీకి రాసిన లేఖలో రాశారు.బీజేపీలో చేరిన టీఎంసీ వ్యవస్థాపకుడు ముకుల్ రాయ్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ వచ్చి పరామర్శిం చారు.ముకుల్ రాయ్ కొడుకుతో అభిషేక్ మాట్లాడిన తరువాత బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలోకి రావడంపై ఊహాగానాలు వచ్చాయి.దీంతో రాయ్ భార్య ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేశారు.బీజేపీని సంస్థాగతంగా బలహీన పర్చడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన తన పార్టీ మాజీ నేతలను ఘర్ వాపసీ పేరిట టీఎంసీలోకి చేర్చుకుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.మొత్తం మీద పశ్చిమబెంగాల్ లో టీఎంసీ ఘన విజ యం అనంతరం ఘర్ వాపసీ నినాదం చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here