కోల్కతా:పశ్చిమ బెంగాల్లో 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్లు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.కొందరు బీజేపీ నాయకులు తమతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారని టీఎంసీ నేతలు పేర్కొన్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిన మాజీ టీఎంసీ నాయకులు ఘర్ వాపసీ (సొంత ఇంటికి తిరిగి రావాలని) మమతాబెనర్జీ పిలుపునిచ్చారు.దక్షిణ 24 పరగణాలలోని సత్గాచియాకు చెందిన నా లుగుసార్లు శాసనసభ్యుడైన గుహా మమతాబెనర్జీకి లేఖ రాశారు.చేపలు నీటి నుంచి బయటపడలేవు మీరు లేకుండా నేను జీవించలేను అని దీదీకి రాసిన లేఖలో రాశారు.బీజేపీలో చేరిన టీఎంసీ వ్యవస్థాపకుడు ముకుల్ రాయ్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ వచ్చి పరామర్శిం చారు.ముకుల్ రాయ్ కొడుకుతో అభిషేక్ మాట్లాడిన తరువాత బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ తిరిగి టీఎంసీలోకి రావడంపై ఊహాగానాలు వచ్చాయి.దీంతో రాయ్ భార్య ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేశారు.బీజేపీని సంస్థాగతంగా బలహీన పర్చడమే లక్ష్యంగా బీజేపీలో చేరిన తన పార్టీ మాజీ నేతలను ఘర్ వాపసీ పేరిట టీఎంసీలోకి చేర్చుకుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.మొత్తం మీద పశ్చిమబెంగాల్ లో టీఎంసీ ఘన విజ యం అనంతరం ఘర్ వాపసీ నినాదం చర్చనీయాంశంగా మారింది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...