కొలిక్కి రాని నీటి పంచాయితీ..

0
325

హైదరాబాద్:వాటాల్లో లెక్కలు తేలలేదు.వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది.జలసౌధలో సుదీర్ఘంగా సాగిన KRMB మీటింగ్‌నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశా రు.కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టింది తెలంగాణ.గతంలో ఏపీ,తెలంగాణ మధ్య జరిగిన 512:219 TMCల నీటి పంపిణీ తాత్కాలికమేనని అధికారు లు వాదించారు.కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా మాత్రమే అంగీకారం కుదిరిందని చెప్పారు.ఎస్‌ఎల్‌బీసీ,కల్వకుర్తి,నెట్టెంపాడు,భీమా ప్రాజెక్టులు పూర్తయ్యాయ ని నీటి వినియోగం పెరిగిందని వాదనలు వినిపించారు.ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని డిమాండ్ చేసారు.ఏపీ ప్రతిపాదించిన 70:30 నిష్పత్తిని అంగీకరించమని స్పష్టం చేశారు.తెలంగాణ వాదనలకు కౌంటర్ ఇచ్చింది ఏపీ.50:50 నిష్పత్తిలో నీటి పంపిణీకి ససేమిరా అంది.70:30 ఫార్ము లానే ఫాలో కావాలని డిమాండ్ చేసింది.అటు విద్యుత్ ఉత్పత్తిపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది ఏపీ.నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల్లో పవర్‌ జనరేషన్‌ను వెంటనే ఆ పాలని డిమాండ్ చేసింది.మొత్తంగా 10 అంశాలపై వాదనలు వినిపించార ఏపీ అధికారులు.తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు అభ్యం తరాలు వ్యక్తం చేశారు.మొత్తానికి నీటి లెక్కలు,ప్రాజెక్టులు,విద్యుత్‌ ఉత్పత్తిపై ఎవరి వాదనలకు వారే కట్టుబడటంతో ఎడతెగని పంచాయితీ కొనసాగింది.చివరికి తెలం గాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here