మ‌రో నాలుగు మండ‌లా‌ల్లో..ద‌ళిత బంధు?

హైద‌రాబాద్:దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్నది.ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను,దళిత ప్రజల యొక్క మనోభావాలను,వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని తూర్పు,పడమర,ఉత్తర,దక్షిణ భాగాల్లో వున్న,దళిత శాసన సభ్యులు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.నాలుగు మండ‌లాలు ఇవే చింత‌కాని మండ‌లం(మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం,ఖ‌మ్మం జిల్లా)తిరుమ‌ల‌గిరి మండ‌లం(తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం,సూ ర్యాపేట జిల్లా)చార‌గొండ మండ‌లం(అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం,నాగర్‌క‌ర్నూల్ జిల్లా)నిజాం సాగ‌ర్ మండ‌లం(జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం,కామారెడ్డి జిల్లా)ఈ 4 మండలా ల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది.సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద‌రాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు.ఆ సమావేశంలో నిర్ణయా లు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here