హైదరాబాద్:దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్నది.ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను,దళిత ప్రజల యొక్క మనోభావాలను,వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు,పడమర,ఉత్తర,దక్షిణ భాగాల్లో వున్న,దళిత శాసన సభ్యులు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.నాలుగు మండలాలు ఇవే చింతకాని మండలం(మధిర నియోజకవర్గం,ఖమ్మం జిల్లా)తిరుమలగిరి మండలం(తుంగతుర్తి నియోజకవర్గం,సూ ర్యాపేట జిల్లా)చారగొండ మండలం(అచ్చంపేట నియోజకవర్గం,నాగర్కర్నూల్ జిల్లా)నిజాం సాగర్ మండలం(జుక్కల్ నియోజకవర్గం,కామారెడ్డి జిల్లా)ఈ 4 మండలా ల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది.సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు.ఆ సమావేశంలో నిర్ణయా లు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారట.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...