హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పా రు.బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు పట్టించుకోబోమని అన్నారు.అవినీతికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని 18 మంది టీఆర్ఎస్ ముఖ్య నేతల అ వినీతి వివరాలను సేకరించామని వాటి గురించి ఇప్పటికే లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని చెప్పారు.సహారా,ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర గురించి కూడా వివరా లను తీసుకున్నామని తెలిపారు.కేసీఆర్ కేసుల గురించి గత వారం రోజులుగా ఆరా తీస్తున్నామని చెప్పారు.ఈ కుంభకోణాల వివరాల గురించి తెలుసుకున్న తర్వా త కేసీఆర్ ఎంత అవినీతిపరుడో తెలిసిందని అన్నారు.