భోపాల్:కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఆక్సిజన్ కొరత,బెడ్స్ కొరతతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఇదే సమయంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.ఈ క్రమంలో మధ్యప్రదేశ్కు చెందిన సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ప్రకటన చర్చనీయాంశమైంది.యజ్ఞం నిర్వహిస్తే పర్యావరణం శుద్ధి అయ్యి థర్డ్వేవ్ అపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.పూర్వకాలంలో మహమ్మారులను అంతం చేయడానికి యజ్ఞాలు నిర్వహించేవారు.ప్రస్తుత మహమ్మారికీ అదే విరుగుడు.అందుకోసం పర్యావరణాన్ని శుభ్రం చేయాలి.అందుకు మీ సహకారం కావాలి.ఇది ఆచారమో,మూర్ఖత్వమో కాదు.యజ్ఞం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేయగలిగితే థర్డ్ వేవ్ అనేది మన ఇండియా దరి చేరదు అని మంత్రి చెప్పుకొచ్చారు.ఇండోర్లో ఓ కొవిడ్ కేర్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.గతంలోనూ జన సమూహంలో ఉన్నప్పుడు కూడా మాస్కు పెట్టకోకుండా ఆమె కనిపించిన సందర్భాలు ఉన్నాయి.దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విషయమై ఆమెను ప్రశ్నిస్తే తాను వేదకాలం నాటి జీవన విధానాన్ని అవలంబిస్తానని,రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తాను కాబట్టి కొవిడ్ సోకదని చెప్పడం గమనార్హం.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...