హైదరాబాద్:భారతదేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు మెండు.ప్రాంతీయ పార్టీల విషయంలో ఇది మరీ ఎక్కువ.ఏ రాష్ట్రమైనా ప్రాంతీయ పార్టీల విషయంలో చాలా వరకూ వారసులే పార్టీ పగ్గాలను తీసుకుంటుంటారు.వారసులు లేని పక్షంలో కూడా పార్టీలో తొలిస్థానం బంధువులకే దక్కుతుంది.అది కూడా కుదరకపోతేనే బయటివారికి అవకాశం వస్తుంది.అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంలో కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్కే ప్రథమ స్థా నం లభిస్తుంది.తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అనే ప్రచారం కూడా ఉన్న సంగతి తెలిసిందే.కేసీఆర్,కేటీఆర్ తర్వాత వారసత్వం ప్రకారం మూడో తరంగా హి మన్షురావు రాజకీయాల్లోకి వస్తారనే ఊహ అందరిలోనూ ఉంది.కానీ ఆయన ప్రస్తుతం పాఠశాల విద్య చదువుతున్నారు.తాత తండ్రిలాగానే ఎప్పటికైనా హిమన్షు రా జకీయాల్లోకి వస్తారని వారిలాగే చక్రం తిప్పుతారని అందరూ అనుకుంటున్నారు.అయితే భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా?అసలు పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉందా? అనే అంశంపై హిమాన్షు క్లారిటీ ఇచ్చారు.ఈ మేరకు ట్వీట్ చేశారు.ట్విటర్ ద్వారా తన అభిమతాన్ని తెలిపిన హిమాన్షు తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు.తన కలలు లక్ష్యాలు తనకు ఉన్నాయని వాటిని సాకారం చేసుకోవాల్సి ఉందని హిమన్షు ట్వీట్లో పేర్కొన్నారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...