హైదరాబాద్:భారతదేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు మెండు.ప్రాంతీయ పార్టీల విషయంలో ఇది మరీ ఎక్కువ.ఏ రాష్ట్రమైనా ప్రాంతీయ పార్టీల విషయంలో చాలా వరకూ వారసులే పార్టీ పగ్గాలను తీసుకుంటుంటారు.వారసులు లేని పక్షంలో కూడా పార్టీలో తొలిస్థానం బంధువులకే దక్కుతుంది.అది కూడా కుదరకపోతేనే బయటివారికి అవకాశం వస్తుంది.అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంలో కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్కే ప్రథమ స్థా నం లభిస్తుంది.తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అనే ప్రచారం కూడా ఉన్న సంగతి తెలిసిందే.కేసీఆర్,కేటీఆర్ తర్వాత వారసత్వం ప్రకారం మూడో తరంగా హి మన్షురావు రాజకీయాల్లోకి వస్తారనే ఊహ అందరిలోనూ ఉంది.కానీ ఆయన ప్రస్తుతం పాఠశాల విద్య చదువుతున్నారు.తాత తండ్రిలాగానే ఎప్పటికైనా హిమన్షు రా జకీయాల్లోకి వస్తారని వారిలాగే చక్రం తిప్పుతారని అందరూ అనుకుంటున్నారు.అయితే భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా?అసలు పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉందా? అనే అంశంపై హిమాన్షు క్లారిటీ ఇచ్చారు.ఈ మేరకు ట్వీట్ చేశారు.ట్విటర్ ద్వారా తన అభిమతాన్ని తెలిపిన హిమాన్షు తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు.తన కలలు లక్ష్యాలు తనకు ఉన్నాయని వాటిని సాకారం చేసుకోవాల్సి ఉందని హిమన్షు ట్వీట్లో పేర్కొన్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...