హైదరాబాద్:జర్నలిస్టు చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని,మిగిలిన కేసులను స్టేట్మెంట్స్గా పరిగణించాలని,మిగిలిన కేసులను మూసేయాలని స్పష్టంచేసింది.ఈ కే సుల దర్యాప్తును డీజీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పునిచ్చారు.నవీన్కుమా ర్పై 35 కేసులు నమోదు చేయగా,ఇందు లో 22 కేసులు హైదరాబాద్ పరిధిలోనికి కాగా 13 వివిధ ప్రాంతాలకు సంబంధించినవి.ఈ కేసుల్లో పీటీ వారెంట్,వారెంట్ జారీ అయిన సమాచారాన్ని నవీన్కుమార్కు లేదా ఆయన భార్య మత్తమ్మకు వారంలో తెలియజేయాలి.నవీన్కు మార్పై నమోదుచేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లేవని,ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్కుమార్ కేసులో ఇచ్చిన తీ ర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41-ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీచేయాలి.నవీన్కుమార్ను అరెస్టు చేయాలనుకున్నా,పీటీ వారెంట్ కింద అరెస్టు చూపించాల నుకున్నా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి.ప్రతీకారం తీర్చుకునే తరహాలో పోలీసులు వ్యవహరించరాదు.నవీన్కుమార్,ఆయన భార్యను వేధింపులకు గురిచే యరాదు.వీరిపై కేసుల నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ హెచ్వోలను ఆదేశించాలి.దర్యాప్తు న్యాయబద్ధంగా,పారదర్శకంగా చేయాలి’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...