హుజురాబాద్:త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని కేసీఆర్,హరీశ్ రావుకు సవాల్ విసిరారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరులో ఆయన ఆదివారం పర్యటించారు.కేసీఆర్,హరీశ్ రావులకు ఈటల రాజేందర్ సవాల్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పలువురు బీజేపీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ నన్ను ఓడించేందుకు 5 వేల కోట్లయినా ఖర్చు చేస్తారట.బక్క పల్చటి పిలగాడు దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్ ? నేను దిక్కులేని వాన్ని కాదు.హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను.వస్తవా రా! హరీశ్.ఇక్కడ పోటీ చేద్దాం.నా మీద పోటీ చేయ్.అంటూ ఇవాళ సంచలన ఛాలెంజ్ లకు దిగారు బీజేపీ హుజురాబాద్ నేత ఈటల రాజేం దర్.బక్క పల్చటి పిలగాడు,దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించు కున్న బిడ్డను నేను.పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా గొర్రెలిచ్చినా కులాలవారిగా తాయిలాలిచ్చినా నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నారేపు ఎన్నికల్లో చూసుకుందాం అంటే ఈటల ఛాలెంజ్ విసిరారు.ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు.ఈటల రాజేందర్ను ఓడించేం దుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట.గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లువాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే.న న్ను కాపాడుకుంటరా చంపుకుంటరా మీ ఇష్టం.అంటూ ఈటల హుజురాబాద్ ప్రజల్ని కోరారు.ఎక్కడ దు:ఖం ఉన్నా ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను.దళితుల ఓట్ల మీద తప్ప హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదు.హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్ ఓట్లయ్యాక ఆ హామీ నెరవేర్చలేదు. అంటూ ఈటల చెప్పుకొచ్చారు.దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలి.తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు.అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి.ఏమిచ్చినా తీసుకోండి.ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి.అంటూ ఇవాళ నిర్వ హించిన హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఈటల ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...