హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు.ఇటీవల కాలంలో బీజేపీ చాలా అంశాల్లో విజయం సాధించిందని అన్నారు.ఫాంహౌస్ లో కాలం గ డిపే ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ కు రప్పించామని తెలిపారు.గతంలో ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ ను ఇప్పుడదే ధర్నా చౌక్ లో కూర్చుని దీక్ష చేపట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.అ యితే కేసీఆర్ దీక్ష చేసింది రైతుల కోసం కాదని,రైస్ మిల్లర్ల కోసమేనని బండి సంజయ్ విమర్శించారు.కేసీఆర్ దీక్షకు,ప్రధాని మోదీ రైతు చట్టాలు రద్దు చేయడానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు.ఇక్కడ నువ్వు దీక్ష చేసింది ధాన్యం కొనుగోలు గురించి అక్కడ మోదీ రద్దు చేసింది రైతు చట్టాలను.ఇక్కడ నువ్వు తిడితే మోదీ అక్కడ రద్దు చేశారా? ఇంతకీ నువ్వు దీక్ష చేసింది పంజాబ్ రైతుల కోసమా,తెలంగాణ రైతుల కోసమా?అని నిలదీశారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...