హైదరాబాద్:టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్కు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా తెరపైకి ఏడు కొత్త ముఖాలు వచ్చినట్లు తెలుస్తోంది.12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.సిట్టింగ్లలో కరీంనగ ర్ నుంచి భానుప్రసాద్,వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,రంగారెడ్డి నుంచి శంభీపూర్ రాజు,పట్నం మహేందర్రెడ్డి,మహబూబ్నగర్ నుంచి కసిరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చా రు.కొత్తగా ఏడుగురికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు.ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ స్థానంలో దండే విఠల్ కు అవకాశం ఇచ్చారు.2014 ఎన్నికల్లో దండే విఠల్ సనత్నగర్ ఎమ్మె ల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.కరీంనగర్ నుంచి నారదాసు స్థానంలో ఎల్.రమణ,నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.నిజామాబాద్ నుంచి మ రోసారి పోటీకి కవిత ఆసక్తి చూపలేదు.మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం ఇచ్చారు.ఖమ్మం ఎమ్మెల్సీ కోసం హోరాహారీ పోటీ సాగింది.చివరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని స్థానం లో తాతా మధుకు ఛాన్స్ ఇచ్చారు.మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి స్థానంలో డాక్టర్ యాదవరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.మహబూబ్నగర్ నుంచి దామోదరరెడ్డి స్థానంలో సింగ ర్ సాయిచం ద్ కు అవకాశం ఇచ్చారు.ఖరారైన 12మంది అభ్యర్థులు రేపు నామినేషన్ వేయనున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...