అంద‌రి అభిప్రాయాల‌తోనే..సెప్టెంబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌ లు ఓపెన్:సీఎం కేసీఆర్

హైదరాబాద్:అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్,ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌ యించారు.కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున:ప్రారంభించే అంశంపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.గ్రామాలు,పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు,వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్,మున్సిపల్ శాఖ ల మంత్రులు,అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఇబ్బందుల్లో విద్యావ్య‌వ‌స్థ..ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది.విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు సహా ప్రయివేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమ య పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను,అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాం.రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం.గతం కంటే రాష్ట్రంలో కరోనా ని యంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు.ప్రస్థుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది.అదే సందర్భంలో విద్యాసంస్థల ను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక వత్తిడి పెరుగుతున్నదని,అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపే పరిస్థితి వున్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.అంద‌రి అభిప్రాయాల‌తోనే..ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేజి నుంచి పీజీ దాకా ప్రయివేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పున:ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నద‌ని అని సీఎం కేసిఆర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here