నల్లగొండ:చదివింది బీటెక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు.భక్తులకు మాయమాటలతో టోపీ వే స్తున్న ఓ బురిడీ బాబాను నల్లగొండ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ దొంగ బాబాను నమ్మి మోసపోయిన ఏపీలోని కృష్ణా జిల్లా విజయ వాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.విశ్వసనీయ వర్గాల కథనం మేరకు కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు.అక్కడే బీటెక్ వరకు చదివాడు.అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు.నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామస్థులు కొందరు అతడికి భక్తులుగా మారి అతడు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గ్రామంలో పదెకరాల స్థలాన్ని అందజే శారు.దీంతో ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం’పేరుతో 2020లో విశ్వచైతన్య ఓ ఆశ్రమాన్ని నెలకొల్పాడు.అక్కడే సాయిబాబా ప్రవచనాలు చెబుతూ తాయ త్తులు కడుతూ హోమాలు చేస్తూ రూ.కోట్లు దండుకున్నాడు.10 నెలల వ్యవధిలో విశ్వచైతన్య కోట్లాది రూపాయల డబ్బు,బంగారం వెనకేసినట్లు వార్తలు వస్తున్నా యి.ఆరోగ్య సమస్యలు తొలగిస్తానని చెప్పి విజయవాడకు చెందిన ఓ మహిళ నుంచి రూ.92 లక్షలు నొక్కేశాడు.అయితే ఆమె ఆరోగ్యం బాగు కాకపోవడంతో సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించారు.ఆశ్ర మంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.అతడి వద్ద నగదు బంగారు ఆభరణాలు విలువైన డిపాజిట్ బాండ్లు ల్యాప్టాప్లు ప్రవచన బక్కులను ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.గత ఆరు నెలలుగా బురిడీ బాబా సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.అతడిని పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...