భారీ మెజారిటీతో దీదీ గెలుపు

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం పీఠం నిలబెట్టుకున్నారు.దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.భవానీపూర్‌ ఉప ఎన్నికలో గెలుపొందారు.బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి,నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసి,బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.బెంగాల్ లో వరుసగా పార్టీని మూడో సారి అధికారంలోకి తెచ్చి తాను మూడో సారి సీఎం పదవి దక్కించుకున్నారు.కానీ,అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.దీంతో ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.దీంతో భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభ న్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసారు.దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక రాగా టీఎంసీ అభ్యర్ధిగా మమత బెనర్జీ బరిలో దిగారు.బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చే సారు.ఇప్పటి వరకు మమతా సాధించిన విజయాల్లో అన్నింటికంటే ఎక్కువ మెజార్టీలో కంటే ఎక్కువ మెజార్టీ ఇక్కడే సాధించారు.2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమ త బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓడించింది.34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.తాజాగా భవానీ పూర్ ఉప ఎన్నికలో తన రికార్డును తానే తిరగరాశారు.ఈ ఉప ఎన్నికలో ఆమె 58,389 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్,జంగీపూర్ శాసన సభ ని యోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.ఈ నియోజకవర్గాల్లో కూడా టీఎంసీ ఆధిక్యంలో ఉంది.సెప్టెంబర్ 30న జరిగిన పోలింగ్ లో భవారీ పూర్ లో 53.32 శాతం పోలింగ్ న మోదైంది.అదే విధంగా శంశేర్ గంజ్ లో 78.60 శఆతం,జానీపూర:లో 76.12 శాతం పోలింగ్ నమోదలైంది.ఈ ఉప ఎన్నికలో సీపీఎం నుంచి శ్రీబిజ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు.ఇక్కడ టీఎంసీకి గట్టి పట్టు ఉండటంతో తొలి రౌండ్ నుంచి మమత ఆధిక్యత కొనసాగింది.చివరకు భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం పీఠం నిలబెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here