చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారు.రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని కన్నాగి ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు స్టాలిన్.అక్కడ ఆరోగ్య సిబ్బంది,టీకా తీసుకునే వారి తో మాట్లాడి తిరుగు పయనమయ్యారు.ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సెక్కారు.ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్,కండక్టర్,ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యా రు.సీఎం స్టాలిన్తో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.బస్సులు సకాలంలో వస్తున్నాయా సౌకర్యాలు ఎలా ఉన్నాయని సీఎం స్టాలిన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...