బ్యాక్ లాగ్ పోస్టులు..నిరుద్యోగ భృతి ఏమైంది:డీకే అరుణ

0
333

హుజురాబాద్‌:టీఆర్ఎస్‌ పై మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డికె అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.నేడు హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అసత్య ప్రచారాలపై ఆమె చార్జీ షీట్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుండి అందరిని మోసగింవడమే కేసీఆర్ పని అని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు అకాంక్షల మేరకి కాకుండా అవినీతి అహంకారం తో పరిపాలన కొన సాగిస్తున్నడని విమర్శించారు.ఏ త్యాగాల కోసం తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బంధి అయ్యిందన్నారు.తెలంగాణ రాష్ట్రం ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు కెసిఆర్ పక్కన ఉన్నారని నాటి ఉద్యమ కారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.రాజేందర్ సేవలు మరువలేనివేవి..నమస్తే తెలంగాణ పత్రిక ఎక్కడినుండి పుట్టింది.నమస్తే తె లంగాణ కోసం తన భూములని కుదవబెట్టిన ఈటెల రాజేందర్ ఇప్పుడు ద్రోహి ఎలా అయ్యాడు.నీ తొటి నడిచి,నీ అవసరాలు తిర్చున ఈటెల రాజేందర్ ఇప్పుడు తెలంగాణ ద్రోహి ఎలా అయ్యాడా అని ప్రశ్నించారు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కేసీఆర్‌కు మింగుడు పడక ఈటెల రాజేందర్ ని ద్రోహిగా చిత్రీకరించారన్నారు.కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా సేవ లు మరువలేని వని అన్నారు.ఆయన చాలా కష్టపడ్డారన్నారు.ఎంతమందికిచ్చారు దళితులు..దళితబంధు హుజూరాబాద్‌లో లాంచ్ చేసి ప్రతి దళిత కుటుంబంనకి ఎంతమందికి ఇచ్చా రని ప్రశ్నించారు.ప్రజలే కేసీఆర్‌కి హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.ఎస్సీ లకి నలభై వేల బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చెయ్యలేదో కెసిఆర్ జవాబు చెప్పాలని ప్ర శ్నించారు.తెలంగాణ వచ్చాక ప్రైవేట్ ఉద్యోగాలు మేమే ఇచ్చాం అని అంటున్న కేటీఆర్‌కి బుద్ధి ఉండాలని ఆమె అన్నారు.రూ.3,016 నిరుద్యోగ భృతి తెలంగాణలో ఏ ఒకరికన్నా వ చ్చిందా అని ఆమె ప్రశ్నించారు.కేజీటూపీజీ ఎక్కడైనా అమలవుతుందా అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here