పాట్నా:మాట్లాడితే యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుంటారు బీజేపీ నేతలు.తమది నిఖార్సైన పాలన అని చెబుతుంటారు.అలాంటిది సొంత ప్రభుత్వం పైనే బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.బీహార్ రాష్ట్రంలోని నితీశ్ కేబినెట్లో ఉన్న బీజేపీ మంత్రులు అధికా రుల బదిలీల కోసం రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపించడం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.బీహార్ రాష్ట్రంలో ఇటీ వల అధికారుల బదిలీలు జరిగాయి.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ట్రాన్స్ ఫర్లలో ఏకంగా వంద కోట్లపైన చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి.అయితే విపక్ష ఎ మ్మెల్యేలే కాకుండా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే కూడా ఈ తరహా ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది.మొత్తం ఏడుగురు ఎమ్మెల్యే ఈ ఆరోపణలు చే యగా వీరిలో బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ కూడా ఉన్నారు.బీహార్ బదిలీల్లో తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు అధికారులు డబ్బులు ఇచ్చా రని అన్నారు.లంచాలు ఇచ్చిన వారికి బీజేపీ మంత్రులు అవసరమైన చోటికి ట్రాన్స్ ఫర్లు చేయించారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు.వారికి జ్జానేంద్ర సింగ్ కూడా జతకలిశారు.ఒక్కో అధికారి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు.దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా ఇదే విషయంలో ఓ మంత్రి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.తాను చెప్పినా వినకుండా తన శాఖలోని సుమారు 2 వేల మంది అధికారు లు ఉద్యోగులను తన శాఖ ముఖ్యకార్యదర్శి బదిలీ చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...