అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా? ఇప్పుడు 71 సంవత్సరాల 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది.మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని అందుకే అంటారు.ఇవాళేదో నీ భార్యను అన్నారని తెగ బాధపడిపోతున్నావు.కానీ నాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూఫిలింస్ లో నటించిందంటూ పీతల సు జాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? అంటే మాకు ఓ కుటుంబం లేదు,మాకు పిల్లలు లేరు,మాకు గౌరవం లేదా? నువ్వు అధికారంలో ఉన్న ప్పుడు ఎవరినైనా ఏదైనా అంటావా?విజయమ్మను ఎంత ఏడ్పించావు,భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు,షర్మిలమ్మను ఎంత వేదనకు గురిచేశావో ఎవరూ మర్చిపోలేదు.ఈరోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడిస్తే నీపై ఎవరూ జాలిపడరు.అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీపైనా,ఇతరులపైనా సోషల్ మీడియాలో ఎంత తప్పుడు ప్రచారం చేశావో అందరికీ తెలుసు.చంద్రబాబునాయుడూ ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.ఎందుకంటే ఒక మహిళ అని కూడా చూడకుండా,గతంలో మీకోసం పదేళ్లు పనిచేసిన మహిళా నేత అని కూడా చూడకుండా నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారు.నిబంధనలకు విరుద్ధంగా నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేశావు.మహిళా పార్లమెంటుకు పిలిచి 24 గంట ల పాటు నన్ను నిర్బంధించి,హైదరాబాదులో నన్ను విసిరిపారేశారు.ఇవన్నీ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోరు.నువ్వు ఏడ్పించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఇవాళ నీకు తగిలింది.అందరి ఉసు రు తగిలి నువ్వు ఇలా అయిపోయావు.నన్ను రూల్స్ కు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేయించగలిగావు కానీ నిన్ను దేవుడు రెండున్నరేళ్లు కాదు,జీవితంలో మళ్లీ అసెంబ్లీలో అ డుగుపెట్టనంటూ నువ్వే శపథం చేసుకునేలా చేశాడు.బై బై బాబూ బై బై!అంటూ రోజా వ్యంగ్యం ప్రదర్శించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...