బెంగళూరు:భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్ అనుచరులు వారిపై ప్రతిదాడికి దిగారు.ఈ క్రమంలో మీడియా సమావేశం రణరంగంగా మారింది.అసలేం జరిగిందంటే కర్ణాటకలో ఓ రైతు నాయకుడు డబ్బులు తీ సుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది.దీంతో టికాయత్,ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు టికాయత్ నేడు బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టికాయత్ మాట్లాడుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వద్దకు దూ సుకొచ్చారు.ముఖంపై నల్ల సిరా చల్లారు.దీంతో టికాయత్ అనుచరులు,రైతు నేతలు నిరసకారులపై ప్రతిదాడికి దిగారు.పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు.దీంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభా సగా మారింది.ఘటన అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడుతూ వేదిక వద్ద తనకు ఎలాంటి భద్రత కల్పించలేదని కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిం దని ఆరోపించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...