విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ షాప్ యజమాని అక్కడి నుంచి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.అక్కడ ఎమ్మార్ఫీ కన్నా అధికంగా డబ్బులు వసూలు చేశాడు సదరు షాపు యజమాని.పైగా వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు.దీంతో అక్కడే కూర్చుని ఒకొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపులకు పిలిపించారు సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.వెంటనే ఆ రెండు షాపులను సీజ్ చేయించారు.అక్కడి నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపులకు తనిఖీకి వెళ్లారు.ముదినేపల్లిలో ఎరువుల షాపు మూసి ఉండటంతో అక్కడి రైతులను వాకబు చేశారు సబ్ కలెక్టర్.ఎమ్మార్ఫీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్కు గోడు విన్నవించుకున్నారు రైతులు.వెంటనే షాపు యజమానిని పిలిపించారు.ఓనర్పై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్లో ఎన్నో కేఫ్లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్ను చూశారా ఈ కేఫ్లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...