?ముగ్గురి మృతి ఆరుగురికి గాయాలు ?ఆగివున్న లారీని ఢీకొన్న ఇన్నోవా వాహనం ?వర్ధన్న పేట పట్టణ శివారులోని డీసీ తండా వద్ద ఘటన.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు సహా కుమారుడు మృతి చెందగా మరో ఆరుగురు గాయప డ్డారు.వరంగల్ ఖమ్మం హైవే పై వర్ధన్న పేట పట్టణ శివారు డీసీ తండా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.విషయం తెలు సుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతులు కృష్ణారెడ్డి,వర లక్ష్మి,వెంకటసాయి రెడ్డి గా గుర్తించారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోసం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ పెరుక వాడకు వస్తున్న క్రమంలో ఈ దు ర్ఘటన చోటుచేసుకుంది.కారులో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు లేక పొగమంచు కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.ఈ మే రకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...