బెంగళూరు:భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్ అనుచరులు వారిపై ప్రతిదాడికి దిగారు.ఈ క్రమంలో మీడియా సమావేశం రణరంగంగా మారింది.అసలేం జరిగిందంటే కర్ణాటకలో ఓ రైతు నాయకుడు డబ్బులు తీ సుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది.దీంతో టికాయత్,ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు టికాయత్ నేడు బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో టికాయత్ మాట్లాడుతుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వద్దకు దూ సుకొచ్చారు.ముఖంపై నల్ల సిరా చల్లారు.దీంతో టికాయత్ అనుచరులు,రైతు నేతలు నిరసకారులపై ప్రతిదాడికి దిగారు.పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు.దీంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభా సగా మారింది.ఘటన అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడుతూ వేదిక వద్ద తనకు ఎలాంటి భద్రత కల్పించలేదని కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిం దని ఆరోపించారు.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...