హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.నిన్న ఆరోగ్యశాఖ తెలంగాణ విద్యాశాఖతో సంప్రదింపులు జరిపింది.ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని రకాల విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.పాఠశాలలు, హా స్టళ్లు,గురుకులాలు తాత్కాలికంగా బంద్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ బంద్ నుంచి వైద్య కళాశాలలకు మినహాయింపు ఇచ్చింది.స్కూళ్ళు, విద్యాసంస్థలు బంద్ కావడంతో యధావిధిగా రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు కొనసాగనున్నాయి.