రాయికల్  పెద్ద చెరువునీటిని బయటకు పంపండి

జగిత్యాల మార్చి 12, తాజా కబురు ప్రతినిధి: రాయికల్ పట్టణం లోని పెద్ద చెరువుకు ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ డి 52 ద్వారా నీరు నింపడం వల్ల పంటలు మునిగిపోయాయని,తూములు మూసి నీటిని చెరువులోకి పంపుతున్నారని దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని స్థానిక తహశీల్దార్ కుందారపు మహేశ్వర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.చెరువు క్రింద యేసంగి పంటలు పొట్ట దశలో ఉన్నాయని నీరు వదలడం వల్ల పంటలు మురిగిపోతాయని వెంటనే స్పందించి తూములు తెరిచి నీటిని బయటకు పంపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు శివనీతి అమరేందర్, నేమిల్ల నారాయణ, గంగుల శ్రీనివాస్, ఆడేటి రాజేందర్,బొమ్మెన రాజన్న , పంచతీ మహేష్, శివానీతి గంగారం,గంగుల రాజన్న , కోల రమేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here